ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
Updated on: 2023-12-02 18:15:00
కర్నూలు:కర్నూలు మెడికల్ కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు ఆరోపించడం కలకలం రేపింది.సీనియర్ల వేధింపుల పై ఏకంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది.తమ రికార్డులు రాసి పెట్టాలని,తమ గదికి భోజనాలు తీసుకురావాలని సీనియర్లు వేధిస్తున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై కలగజేసుకోవాలని,తమకు వేధింపులు తప్పేలా చర్యలు తీసుకోవాలని జూనియర్ విద్యార్థులు యూజీసీకి లేఖ రాశారు.ఈ ఫిర్యాదుతో స్పందించిన యూజీసి ర్యాగింగ్ విషయాన్ని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది.కాలేజీలో,విద్యార్థుల హాస్టల్స్లో ర్యాగింగ్ నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ఇటీవలే కాలేజీ అనుబంధంగా ఉన్న మెన్స్ హాస్టల్లో గంజాయి,మద్యం సీసాలు బయటపడడం సంచలనం సష్టించింది.దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈలోపే కాలేజీ మరోసారి వార్తల్లో నిలిచింది.