ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
అర్ధరాత్రి కేంద్ర బలగాలు అధీనంలోకి నాగార్జున సాగర్
Updated on: 2023-12-02 08:29:00
నల్లగొండ:నాగార్జున సాగర్ను కేంద్ర బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి.అర్ధరాత్రి సాగర్ డామ్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి.సాగర్ డ్యాం మొత్తాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.నిన్న సాయంత్రం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు,డీజీపీలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి మాట్లాడారు.కేంద్ర బలగాలు రెండు రాష్ట్రాలను అధీనంలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపాయి.దీంతో అర్ధరాత్రికే సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం పంపింది.సాగర్కు ఏపీ వైపు ఏపీ బలగాలు,తెలంగాణ వైపు ఆ రాష్ట్ర పోలీస్లు పహారా కాస్తున్నారు.ఇప్పటికే కేఆర్ఎంబీ సభ్యులు సాగర్కు చేరుకున్నారు.పరిస్థితి పై కేంద్రానికి నివేదిక అందించారు.ఏపీ ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి వ్యవహరించిందని కేఆర్ఎంబీ నివేదికను పంపించింది.ఇండెంట్ లేకుండా,కనీసం లేఖ కూడా రాయకుండా ఏపీ నీటి విడుదల చేసిందని పేర్కొంటూ నివేదిక అందించడం జరిగింది.ముందు ఏపీ ఇచ్చిన ఇండెంట్ ప్రకారం జనవరి,ఏప్రిల్లో 5 టీఎంసీల చొప్పున నీటి విడుదల చేయాల్సి ఉందని కేఆర్ఎంబీ పేర్కొంది.