ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
టీఆర్ఎస్ హఠాత్తుగా బీఆర్ఎస్గా మారింది:ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు
Updated on: 2023-11-25 16:52:00

కామారెడ్డి:వాగ్దానం ఇచ్చామంటే అమలు చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని చెప్పారు.కామారెడ్డి నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం దక్కిందని అన్నారు.టీఆర్ఎస్ హఠాత్తుగా బీఆర్ఎస్గా మారిందని,యూపీఏ కాస్త ఇండియా కూటమిగా మారిపోయిందని విమర్శించారు.ఇక్కడ జన ప్రవాహం కనిపిస్తోంది. తొమ్మిదేళ్ల వారి పాలనపై ప్రజలు విసిగిపోయారు.ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ నుంచి విముక్తి కోరుతున్నారు.ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా విధానాలు ఉన్నాయి.నేను ఇచ్చే మాటలే గ్యారంటీ. దేశానికి బీసీని ప్రధాని చేసింది కూడా బీజేపీనే.తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు డబ్బులు అవసరమైనా అప్పుడు నీటి పారుదల పథకాలు పెట్టుకున్నారు.ప్రజాధనం అంతా కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్ళింది అని మోదీ అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆదివారం,సోమవారం కూడా ప్రచారం నిర్వహించనున్నారు.