ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
తరుగుని ప్రశ్నించారని రైతులపై దాడి.
Updated on: 2023-05-16 10:03:00
ధాన్యం కొనుగోలులో తరుగును ప్రశ్నించిన ఓ గ్రామ సర్పంచుతో పాటు ఇద్దరు రైతులపై రైస్మిల్లు నిర్వాహకులు దాడి చేసిన ఘటన ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో చేటు చేసుకుంది. నిజాంసాగర్ మండలం నర్సింగ్రావ్ పల్లి గ్రామంలో అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం నుంచి పిట్లం మండలంలోని కుర్తి గ్రామశివారులో ఉన్న వైష్ణవి రైస్ మిల్లుకు నాలుగు రోజుల క్రితం లారీని పంపించారు.లారీని డ్రైవర్ గేటు బయట పెట్టి వెళ్లాడు. మూడు రోజుల వరకు ఆన్లోడ్చేయలేదు.తర్వాత లారీలో 761 బస్తాలు తరలిస్తే 57 బస్తాలను తరుగు పేరిట మిల్లు యజమానులు కోత విధించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సాయిలుతో పాటు ముగ్గురు రైతులు రైస్ మిల్లుకు వెళ్లారు.57 బస్తాల కోత విషయమై రైస్ మిల్లు నిర్వాహకులను, యజమానులను నిలదీశారు. ఈ విషయమై మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలిసింది.ఆగ్రహించిన రైస్ మిల్లు యజ మానిని రాంరెడ్డి అనే రైతు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో రైస్ మిల్లు నిర్వాహకులు రైతు రాంరెడ్డిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. రాజిరెడ్డి అనే మరో రైతుపైనా దాడి చేశారు.రైతులపై దాడి చేస్తున్న రైస్ మిల్లు నిర్వాహకులను నిలువరించే ప్రయత్నం చేసిన సర్పంచ్ సాయిలను దూషించడంతో పాటు బయటకు గెంటి వేసినట్లు తెలిసింది.