ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
తరుగుని ప్రశ్నించారని రైతులపై దాడి.
Updated on: 2023-05-16 10:03:00

ధాన్యం కొనుగోలులో తరుగును ప్రశ్నించిన ఓ గ్రామ సర్పంచుతో పాటు ఇద్దరు రైతులపై రైస్మిల్లు నిర్వాహకులు దాడి చేసిన ఘటన ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో చేటు చేసుకుంది. నిజాంసాగర్ మండలం నర్సింగ్రావ్ పల్లి గ్రామంలో అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం నుంచి పిట్లం మండలంలోని కుర్తి గ్రామశివారులో ఉన్న వైష్ణవి రైస్ మిల్లుకు నాలుగు రోజుల క్రితం లారీని పంపించారు.లారీని డ్రైవర్ గేటు బయట పెట్టి వెళ్లాడు. మూడు రోజుల వరకు ఆన్లోడ్చేయలేదు.తర్వాత లారీలో 761 బస్తాలు తరలిస్తే 57 బస్తాలను తరుగు పేరిట మిల్లు యజమానులు కోత విధించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సాయిలుతో పాటు ముగ్గురు రైతులు రైస్ మిల్లుకు వెళ్లారు.57 బస్తాల కోత విషయమై రైస్ మిల్లు నిర్వాహకులను, యజమానులను నిలదీశారు. ఈ విషయమై మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలిసింది.ఆగ్రహించిన రైస్ మిల్లు యజ మానిని రాంరెడ్డి అనే రైతు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో రైస్ మిల్లు నిర్వాహకులు రైతు రాంరెడ్డిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. రాజిరెడ్డి అనే మరో రైతుపైనా దాడి చేశారు.రైతులపై దాడి చేస్తున్న రైస్ మిల్లు నిర్వాహకులను నిలువరించే ప్రయత్నం చేసిన సర్పంచ్ సాయిలను దూషించడంతో పాటు బయటకు గెంటి వేసినట్లు తెలిసింది.