ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
నేడు భద్రాద్రిలో కేటీఆర్ పర్యటన..రామాలయ దర్శనం, రోడ్ షో
Updated on: 2023-11-19 09:45:00
రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు.హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో ఉదయం భద్రాచలం నగరానికి చేరుకుంటారు.11 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం ఉంటుంది.అనంతరం బీఆర్ ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి తైలం వెంకట్రావు విజయాన్ని కాంక్షిస్తూ నగరంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.మధ్యాహ్నం ఒంటిగంటకు ఇల్లెందు నగరానికి చేరుకుంటారు.బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియానాయక్ విజయాన్ని కాంక్షిస్తూ అక్కడ రోడ్ షో నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా కేంద్రం కొత్తగూడెం చేరుకుంటారు.అక్కడ బీఆర్ ఎస్ అభ్యర్థి వన్మా వెంకటేశ్వరరావు గెలుపు కోసం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేటకు చేరుకుంటారు.బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షోలో పాల్గొంటారు.బీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ముగిసిన కొద్ది రోజులకే మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి రావడంతో పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది.కాగా,మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ మధు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.