ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
భూమిని కాపాడాల్సిన అధికారులే భూమిని కాజేస్తున్నారు
Updated on: 2023-05-12 10:16:00
భూముల తారుమారులో రెవిన్యూ అధికారుల పాత్ర. పదిమంది పై చీటింగ్ కేసు నమోదు కు ఆదేశించిన గద్వాల కోర్టు. చిటింగ్ లో రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్, రిటైర్డ్ ఆర్డీఓ, డిటి, వీ ఆర్ వో లు ,మహబూబ్నగర్ పట్టణ పరిసర ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు లో దర్జాగా పాగా వేసేశారు. తాజాగా గద్వాల కోర్టు ఓ కేసు వ్యవహారంలో ఇచ్చిన తీర్పు భూ అక్రమార్కులకు చెంప పెట్టులా మారింది. ప్రభుత్వ భూముల వ్యవహారంలో చీటింగ్ చేసిన వారితోపాటు వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కేసు కూడా నమోదవగా.. ఇందులో రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్, రిటైర్డ్ ఆర్డీఓ పేర్లు ఉండడం హాట్టాపిక్గా మారింది.