ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన పార్టీకే మా మద్దతు
Updated on: 2023-10-28 21:42:00
సిద్దిపేట జిల్లా:నవంబర్ 18న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్షల మందితో మాదిగల విశ్వరూప మహా సభ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు.శనివారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో మాదిగల విశ్వరూప మహా సభలో మందకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుందన్నారు.ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగినప్పుడే వారి పిల్లల చదువులు బాగుపడతాయని. చదువుకున్నవారికి ఉద్యోగాలు వస్తాయన్నారు.అన్ని పార్టీలలో ఉన్నటువంటి దళితులందరు హైదరాబాదులో జరిగే మహాసభకు పార్టీలకు ఆతీతంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మాకు మద్దతు పలకాలన్నారు.ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తామని స్పష్టత ఇస్తే ఆ పార్టీకే తాము మద్దతు పలుకుతామని మందకృష్ణ మాదిగ వెల్లడించారు.