ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన పార్టీకే మా మద్దతు
Updated on: 2023-10-28 21:42:00
సిద్దిపేట జిల్లా:నవంబర్ 18న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్షల మందితో మాదిగల విశ్వరూప మహా సభ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు.శనివారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో మాదిగల విశ్వరూప మహా సభలో మందకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుందన్నారు.ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగినప్పుడే వారి పిల్లల చదువులు బాగుపడతాయని. చదువుకున్నవారికి ఉద్యోగాలు వస్తాయన్నారు.అన్ని పార్టీలలో ఉన్నటువంటి దళితులందరు హైదరాబాదులో జరిగే మహాసభకు పార్టీలకు ఆతీతంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మాకు మద్దతు పలకాలన్నారు.ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తామని స్పష్టత ఇస్తే ఆ పార్టీకే తాము మద్దతు పలుకుతామని మందకృష్ణ మాదిగ వెల్లడించారు.