ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ లో భారీగా చేరికలు
Updated on: 2023-10-18 18:26:00
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ లో ఎంపీటీసీ రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో 150 మంది చేరిక.పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. తిమ్మాపూర్ ఎంపీటీసీ రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 150 మంది బిఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారికి కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ..కొత్తూరు మున్సిపాలిటీని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.రూ. 110 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ఈ పనులన్నీ సక్రమంగా జరుగుతాయని అందుకే యువత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్,ఏనుగు జనార్దన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్,కౌన్సిలర్స్ కోస్గి శ్రీనివాస్,కమ్మరి జయమ్మ జనార్ధన చారి,బ్యాగరి ప్రసన్న లత యాదయ్య ,భాస్కర్ గౌడ్, వెంకటాపురం నాగరాజు, పెద్దాపురం శ్రీనివాస్,గండేటి నరసింహ,చింతకింది పాండు, అమడపురం నరసింహ, గండేటి సాయికిరణ్,శరత్ చారి,తదితరులు పాల్గొన్నారు.