ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
అలజంగి గ్రామంలో జల జీవన్ మిషన్ నిధులు మంజూరు పై సమగ్ర విచారణ చేపట్టాలి
Updated on: 2025-12-24 06:31:00
బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో జల్జీవన్ మిషన్ కింద ఇంటింటికి కులాయిలు పనుల్లో అక్రమాలు జరిగి మంజూరైన నిధులను తాము దుర్వినియోగం చేసి సొంతానికి వాడుకున్నామంటూ గ్రామంలో కొంతమంది చేస్తున్న ఆరోపణలను మానుకోవాలని పంచాయతీ కార్యదర్శి రఘుతో కలిసి సర్పంచ్ భద్రమ్మ ,టిడిపి ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు రెజెటి బుజ్జి బొబ్బిలి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో డి ఈ ఈ దిల్లేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు.అసలే కుళాయిలకు నిధులే మంజూరు చేయకుండా ఎలా తినేస్తామని దీనిపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పరోక్షంగా కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ ప్రచారం చేస్తున్నారని దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నిజా నిజాలు తేల్చాలని లేదంటే గ్రామస్తులు అందరూ అయోమయంలో పడి నిజంగానే నిధులు మంజూరయ్యాయని అనుకుంటారని అన్నారు. దీనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పంచాయతీ కార్యదర్శి రఘు తో పాటు బుజ్జి డి ఈఈ ని కోరారు.