ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మందికి గాయాలు.. ముగ్గురు పరిస్థితి విషమం
Updated on: 2025-11-18 09:16:00
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి ఇవాళ(మంగళవారం) గురైంది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది . స్థానికులు వెంటనే ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ బస్సు వేగంగా వెళ్తూ అనాసాగరం ఫ్లైఓవర్పై లారీని ఓవర్టేక్ చేయబోయి బలంగా ఢీ కొట్టిందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుందని.. ఇందులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం అనాసాగరం ఫ్లైఓవర్పై జరగడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిన బస్సును పక్కకు తీయించి ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు.