ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పేదల కష్టం తెలిసిన గొప్ప నేత సీఎం చంద్రబాబు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Updated on: 2025-11-17 20:22:00
21మంది బాధితులకు...11 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గుడివాడలో రూ.3.31 కోట్ల రికార్డు స్థాయి సీఎంఆర్ఎఫ్ నిధులను...బాధితులకు అందించాం గుడివాడ నవంబర్ 17:రాష్ట్రంలో పేదల కష్టం తెలిసిన గొప్ప నాయకుడు సీఎం చంద్రబాబు అని,బాధల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని 21 మంది బాధితులకు మంజూరైన 11 లక్షల చెక్కులను...టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో కూటమి నేతలతో కలిసి సోమవారం ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మరియు సీఎం చంద్రబాబుకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వివిధ కారణాలతో ఆరోగ్యశ్రీ లేనివారికి సీఎంఆర్ఎఫ్ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రజలకు ఎంతో సహాయంగా ఉండే సీఎం సహాయనిధి వ్యవస్థను ఐదేళ్లుగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్య సంరక్షణకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు.