ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
వాతావరణ మార్పులతో ప్రపంచానికి పెను ముప్పు.. 2050 నాటికి 76 శాతం పెరగనున్న కేసులు
Updated on: 2025-09-10 17:37:00
వాతావరణ మార్పుల కారణంగా 2050 నాటికి ఆసియా, అమెరికా ఖండాల్లోని అనేక దేశాల్లో డెంగీ కేసుల సంఖ్య ఏకంగా 76 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు వాషింగ్టన్, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయాలతో పాటు అమెరికా జాతీయ ఆర్థిక పరిశోధన బ్యూరోకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు.
వారి విశ్లేషణ ప్రకారం, ఇది కేవలం భవిష్యత్తు ముప్పు మాత్రమే కాదు. ఇప్పటికే 1995 నుంచి 2014 మధ్యకాలంలో నమోదైన డెంగీ కేసుల్లో 18 శాతం పెరుగుదలకు వాతావరణ మార్పులే కారణమని తేలింది. దీనివల్ల ఏటా సగటున 46 లక్షల మంది అదనంగా డెంగీ బారిన పడుతున్నారని అంచనా వేశారు.
డెంగీ వైరస్ను వ్యాపింపజేసే దోమలు వృద్ధి చెందడానికి, వ్యాధి వ్యాప్తికి సుమారు 27.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం చల్లగా ఉన్న ప్రాంతాలు వేడెక్కుతున్న కొద్దీ అక్కడ డెంగీ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. మెక్సికో, పెరూ, బ్రెజిల్ వంటి దేశాల్లోని అధిక జనాభా కలిగిన చల్లని ప్రాంతాల్లో కేసుల సంఖ్య భారీగా పెరగవచ్చని అంచనా వేశారు.