ముఖ్య సమాచారం
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
Updated on: 2025-12-16 14:36:00
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు కేంద్రమైన పరకామణిలో చోటుచేసుకునే దొంగతనాలను సాధారణమైనవిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన విషయమని అభిప్రాయపడింది
పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను వెంటనే ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. మానవ ప్రమేయాన్ని తగ్గించి, దాని స్థానంలో యంత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి నూతన సాంకేతికతను వినియోగించాలని టీటీడీకి సూచించింది. చోరీలు జరుగుతున్నప్పటికీ ఇంకా పాత పద్ధతులనే అనుసరించడం సరికాదని వ్యాఖ్యానించింది.
అదే సమయంలో, కానుకల లెక్కింపులో సేవాభావంతో పాల్గొనే భక్తులను దొంగల్లా చూస్తూ, దుస్తులు లేకుండా తనిఖీలు చేయడం వంటివి సరికాదని హితవు పలికింది. వారిని అవమానించడం తగదని పేర్కొంది. ఈ పవిత్రమైన ప్రక్రియలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించడానికి వీల్లేదని కూడా స్పష్టం చేసింది. ఈ అంశంపై తగిన సూచనలు, సలహాలతో తమ ముందుకు రావాలని ఇరుపక్షాల న్యాయవాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.