ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Updated on: 2025-06-12 16:21:00

రాజధాని అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మధ్యాహ్నం ఆయనను కోర్టులో హాజరుపరచగా, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
సాక్షి టీవీ ఛానల్లో ఈ నెల 6వ తేదీన ప్రసారమైన ‘కేఎస్ఆర్ లైవ్ షో’ అనే చర్చా కార్యక్రమంలో వీవీఆర్ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి మహిళల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. ఆ వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, అత్యంత హేయంగా ఉన్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు కూడా అందాయి.