ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఐదో రోజు జరిగిన డీఎస్సీ పరీక్షలకు 92.87 శాతం మంది హాజరు
Updated on: 2025-06-11 21:12:00

మెగా డీఎస్సీ – 2025 పరీక్షల నిర్వహణలో భాగంగా ఐదో రోజు నిర్వహించిన టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్) హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ భాషా పరీక్ష, వ్యాయమ ఉపాధ్యాయులు (ఫిజికల్ డైరెక్టర్) పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 14949 అభ్యర్థులకు గాను 13883 (92.87%) మంది హాజరయ్యారని మెగా డీఎస్సీ–2025 కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
బుధవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన టీజీటీ (లాంగ్వేజ్) హిందీ, స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజ్) ఉర్దూ, పరీక్షలకు 8231 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా, 7800 (94.76%)మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 41 కేంద్రాల్లో జరిగిన ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్) పరీక్షకు దరఖాస్తు చేసిన 6718 అభ్యర్థులకు 6083 (90.55%) మంది హాజరయ్యారని తెలిపారు.
ఉదయం పశ్చిమగోదావరి జిల్లాలో, మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా లో అత్యధికంగా హాజరు నమోదైందని మెగా డీఎస్సీ–2025 కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు.