ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు విదేశీ రుణాలు
Updated on: 2025-05-15 07:22:00

ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్ఎల్) వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం అవసరమైన 12,000 కోట్ల రుణ సమీకరణపై కార్పొరేషన్ దృష్టి సారించింది. విశాఖపట్నం మెట్రోకు 6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు 5900 కోట్ల రుణం అవసరమని అంచనా వేసిన ఏపీఎంఆర్ఎల్ తక్కువ వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేసే విదేశీ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB) ప్రతినిధులతో ఏపీఎంఆర్ఎల్ ఎండీ రామకృష్ణారెడ్డి విజయవాడలోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు. AIIB ప్రతినిధులు సంతోష్, పాస్కల్ రసెల్ విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు 26 కిమీ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు 12 కిమీ మార్గాలను సందర్శించిన వారు రుణాలు మంజూరు చేసేందుకు ఆసక్తి కనబరిచారు.