ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
Updated on: 2025-05-13 16:09:00

ఇతరులను వేధించడం, ఆధిపత్యం చెలాయించాలనే ధోరణులను ప్రదర్శించే దేశాలు చివరికి ఒంటరిగా మిగిలిపోతాయని చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంలో కొంత పురోగతి కనిపించడం, సుంకాల విధింపునకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఒప్పందంలో భాగంగా, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ రేటును 115 శాతం తగ్గించామని, దీనితో మొత్తం సుంకం 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితమైందని యూఎస్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. అదేవిధంగా, అమెరికా వస్తువులపై చైనా కూడా తన సుంకాన్ని అంతేస్థాయిలో తగ్గించడంతో, అక్కడ సుంకం 125% నుంచి 10 శాతానికి దిగివచ్చిందని జెనీవాలో గ్రీర్తో పాటు అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు.