ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
భారతదేశ సమైక్యత, సౌభ్రాతృత్వానికి నేటితో 76 ఏళ్ళు - ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Updated on: 2025-01-26 13:35:00

గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్యాంప్ కార్యాలయం & జ్యోతిర్మయి అపార్ట్మెంట్స్ లో జాతియజెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
భారతదేశ సమైక్యత, సౌభ్రాతృత్వానికి నేటితో 76 ఏళ్ళు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కొనియాడారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీనివాసరావు పేటలోని తన క్యాంప్ కార్యాలయంలో మరియు జ్యోతిర్మయి అపార్ట్మెంట్స్ లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య రాజ్యంగా అవతరించి నేటికి 75 ఏళ్లు పూర్తై 76వ ఏటలో అడుగుపెడుతున్నామని,సమైక్యత, సౌభ్రాతృత్వం గల అతిపెద్ద ప్రజాస్వామ్యం, భారతీయ రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏళ్ళు అవుతోందని దీని వెనుక ఎంతోమంది మహానుభావుల త్యాగఫలం ఉన్నదని, వారి త్యాగాలను మనం మరవకూడదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. స్వేచ్ఛాయుత భారతదేశంలో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరువ కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేలా ప్రజలందరూ భాద్యత తీసుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.