ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
పవన్ 'వారాహి' యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం:బాలకృష్ణ
Updated on: 2023-09-30 17:00:00
నంద్యాల:జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన 'వారాహి'యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, తెదేపా నేత నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు.తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది.ఈ భేటీ అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు.సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు.ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు.ఆయనపై స్కిల్ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారు అని బాలకృష్ణ ఆరోపించారు.ఈ సమావేశంలో ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యే బాలకృష్ణ,యనమల.రామకృష్ణుడు,నక్కా.ఆనంద్బాబు,అశోక్ బాబు,బీద.రవిచంద్ర,నిమ్మల రామానాయుడు,బీసీ జనార్దన్ రెడ్డి,వంగలపూడి.అనిత తదితరులు పాల్గొన్నారు.