ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పవన్ 'వారాహి' యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం:బాలకృష్ణ
Updated on: 2023-09-30 17:00:00
నంద్యాల:జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన 'వారాహి'యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, తెదేపా నేత నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు.తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది.ఈ భేటీ అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు.సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు.ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు.ఆయనపై స్కిల్ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారు అని బాలకృష్ణ ఆరోపించారు.ఈ సమావేశంలో ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యే బాలకృష్ణ,యనమల.రామకృష్ణుడు,నక్కా.ఆనంద్బాబు,అశోక్ బాబు,బీద.రవిచంద్ర,నిమ్మల రామానాయుడు,బీసీ జనార్దన్ రెడ్డి,వంగలపూడి.అనిత తదితరులు పాల్గొన్నారు.