ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కెవైసి, బ్యాంకింగ్ భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం*
Updated on: 2026-02-13 16:39:00
*కెవైసి, బ్యాంకింగ్ భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం* ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో కెవైసి (KYC)పై బాడంగి మండలం గొల్లాది గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బొబ్బిలి ఆర్థిక అక్షరాస్యత కేంద్ర కౌన్సిలర్స్ లక్ష్మణ్, అనురాధ, చంటిలు పాల్గొని ప్రజలకు కెవైసి అవసరం, దాని ద్వారా బ్యాంకింగ్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు ఖాతాలను సక్రమంగా నిర్వహించుకోవాలని, ఆధార్, పాన్ వంటి పత్రాలు నవీకరించుకోవడం ద్వారా లావాదేవీలు సురక్షితంగా ఉంటాయని సూచించారు. బ్యాంకింగ్ సేవల వినియోగం, డిజిటల్ చెల్లింపుల్లో జాగ్రత్తలు, సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలు ఎవరైనా అనుమానాస్పద కాల్స్ లేదా లింక్స్కు స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బ్యాంకింగ్ భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎస్ఎస్ టి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆంజనేయులు, మేనేజర్ అశోక్ల పర్యవేక్షణలో జరిగింది