ముఖ్య సమాచారం
-
ఏఐ సబ్జెక్టుతో ఏకంగా 50 కోర్సులు తీసుకువచ్చిన ఛండీగఢ్ యూనివర్సిటీ
-
భారత్లో ఎలాన్ మస్క్ స్టార్లింక్కు లైసెన్స్!
-
ఫిజియోథెరపీ పేరుతో ఇంట్లోకి చొరబడి... హైదరాబాద్ లో వృద్ధ దంపతుల దారుణ హత్య
-
న్యూజిలాండ్ లో కరోనా విజృంభణ
-
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై కారు దగ్ధం... వీడియో ఇదిగో!
-
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్
-
జమ్మూ కశ్మీర్లో వరల్డ్ వండర్ ఆవిష్కృతం..
-
మాజీ ఎంపీ యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ కన్నుమూత
-
పిన్ కోడ్ లకు ఇక గుడ్ బాయ్ భవిష్యత్తు మొత్తం డిజిపిన్ లపైనే
-
ఫ్లిప్కార్ట్'కు ఆర్బీఐ నుంచి కీలక అనుమతి... దేశంలో ఇదే తొలిసారి!
నేరస్థులను పరామర్శించటానికి వచ్చిన జగన్ రెడ్డిని సైకో కింగ్ అనటంలో తప్పు లేదు - ఎమ్మెల్యే గల్లా మాధవి
Updated on: 2025-06-05 13:42:00

తెనాలిలో గంజాయి విక్రయాలు, సామాన్యుల ఫై దాడులు, మహిళా ఫై వేధింపులు, హింసాత్మక ఘటనలకు పాల్పడిన నేరస్థులను పరామర్శించటానికి వచ్చిన జగన్ రెడ్డిని సైకో కింగ్ అనటంలో తప్పు లేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మంగళవారం తెనాలిలో జగన్ రెడ్డి పర్యటనను ఖండిస్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. మనీలాండరింగ్, క్విడ్ ప్రోకో కేసులు, క్రిమినల్ కేసులు ఉన్న జగన్ రెడ్డి తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించటం సిగ్గు చేటని, గంజాయి బ్యాచ్ కు డాన్ లాగా జగన్ రెడ్డి మారిపోయారని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత యువకుల మీద దాడి అంటున్న జగన్ రెడ్డి " నేరస్థులకు కూడా కులాలు ఆపాదించి లబ్ది పొందాలని చూస్తున్న జగన్ రెడ్డి ఎంతలాగా దిగజారిపోయారని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. వైసిపి హయాంలో దళిత డాక్టర్ సుధాకర్ ను ఎలా హింసించి చంపారో, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను చంపి డోర్ డెలివరీ చేసారో, అంబేద్కర్ విదేశి విద్య, యస్సీ కార్పోరేషన్ ను ఎలా నిర్వీర్యం చేసారో ప్రజలు ఎవరు మర్చోపోలేదన్నారు. పోలీసులు, రౌడీ షీటర్ల మీద చర్యలు తీసుకుంటే దానిని రాజకీయం చేయాలనీ చూడటం జగన్ రెడ్డి క్రిమినల్ ఆలోచనలకు నిదర్శనమని, ఇటువంటి పర్యటన్లు చేస్తే త్వరలోనే వైసిపి కనుమరుగు అవ్వటం ఖాయమని ఎమ్మెల్యే గల్లా మాధవి జోస్యం చెప్పారు.