ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రణాళికతో ముందుకు వెళ్దాము - ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Updated on: 2025-02-13 18:40:00

గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో పట్టభద్రుల ఎన్నికలకు ప్రణాళికతో ముందుకు వెళదామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పార్టీ నేతలను కోరారు. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పరిశీలకులు సింహాద్రి కనకాచారి, కోవెలమూడి రవీంద్రలతో కలిసి కార్పొరేటర్లు, క్లస్టర్, డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్సి ఓట్లు అత్యధికముగా ఉన్నాయని, వారందరినీ డోర్ టూ డోర్ కలిసి ప్రచారం చేయటంతో పాటు, ఓటు ఎలా వేయాలన్న దాని మీద అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని మంచి పాలనకు తోడ్పాటునందించాలని కోరుతూ ఓట్లు అభ్యర్ధించాలని సూచించారు. గత ప్రభుత్వం దెబ్బకు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందని, దీనిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే సత్తా ఎన్డీయే కూటమికి ఉందని, శాసనసభకు అత్యధిక సీట్లు గెలిపించిన మాదిరిగానే, శాసనమండలి అభ్యర్దులను గెలిపించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, ఈరంటి వర ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఆడక పద్మావతి, శ్రీవల్లి, మానం శ్రీనివాస్,సుఖవాసి శ్రీనివాస్ రావు, కసుకుర్తి హనుమంతరావు, రావిపాటి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.