ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రణాళికతో ముందుకు వెళ్దాము - ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Updated on: 2025-02-13 18:40:00
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో పట్టభద్రుల ఎన్నికలకు ప్రణాళికతో ముందుకు వెళదామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పార్టీ నేతలను కోరారు. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పరిశీలకులు సింహాద్రి కనకాచారి, కోవెలమూడి రవీంద్రలతో కలిసి కార్పొరేటర్లు, క్లస్టర్, డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్సి ఓట్లు అత్యధికముగా ఉన్నాయని, వారందరినీ డోర్ టూ డోర్ కలిసి ప్రచారం చేయటంతో పాటు, ఓటు ఎలా వేయాలన్న దాని మీద అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని మంచి పాలనకు తోడ్పాటునందించాలని కోరుతూ ఓట్లు అభ్యర్ధించాలని సూచించారు. గత ప్రభుత్వం దెబ్బకు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందని, దీనిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే సత్తా ఎన్డీయే కూటమికి ఉందని, శాసనసభకు అత్యధిక సీట్లు గెలిపించిన మాదిరిగానే, శాసనమండలి అభ్యర్దులను గెలిపించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, ఈరంటి వర ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఆడక పద్మావతి, శ్రీవల్లి, మానం శ్రీనివాస్,సుఖవాసి శ్రీనివాస్ రావు, కసుకుర్తి హనుమంతరావు, రావిపాటి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.