ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రైల్వే 'గేట్లపై' ఆర్.ఓ.బి. నిర్మాణానికి ఆ శాఖ అనుమతులు మంజూరు:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Updated on: 2025-11-21 09:21:00
గుడివాడ నవంబర్ 20:గుడివాడ పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతంగా జరిగేలా కృషి చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనీగండ్ల రాము అన్నారు.సాంకేతిక కారణాలతోనే నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై...
ఎన్.హెచ్.ఎ అధికారులతో ప్రజా వేదిక కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాము సమీక్షించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని అధికారులతో ఎమ్మెల్యే రాము అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు.... రైల్వే శాఖ సాంకేతిక అనుమతుల ఆలస్యం కావడంతోనే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అవాంతరాలు వచ్చినట్లు చెప్పారు. భీమవరం, మచిలీపట్నం రైలు గేట్లపై నిర్మాణ పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
రైల్వే గేట్ల వద్ద కల్వర్టు,O.H.C పోల్స్, S.N.D. కేబుల్స్ నిర్మాణాలకు... రైల్వే శాఖకు ఎన్. హెచ్. ఏ. 8 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు.నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా ఎంపీ వల్లభనేని బాలసౌరి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. ఆయన సహకారంతో ఢిల్లీ స్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి అయ్యేలా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రాము అన్నారు.