ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త
Updated on: 2025-11-19 10:48:00
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షల్లో 32 పేజీల సమాధాన పత్రాల బుక్లెట్ను అందించనున్నారు.
ఈ ఏడాది నుంచి అమలులోకి వచ్చిన ఎన్సీఈఆర్టీ సిలబస్, ప్రశ్నపత్రాల విధానంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా, తొలిసారిగా ప్రవేశపెట్టిన ఒక మార్కు ప్రశ్నల వల్ల ప్రశ్నల సంఖ్య పెరగడం, గణితంలో రెండు పేపర్లకు బదులుగా ఒకే పేపర్ కావడంతో మార్పులు చేశారు. ఈ ఏడాది ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి ఈసారి 10.40 లక్షల మంది (5.35 లక్షల మంది ఫస్టియర్, 5.05 లక్షల మంది సెకండియర్) పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. అయితే సెకండియర్ ప్రశ్నపత్రాలు, జవాబుల బుక్లెట్ల్లో మార్పుండదు.. పాత విధానం కొనసాగుతుంది.
గతంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ను ఇచ్చేవారు. అయితే ఈసారి గణితం (మ్యాథ్స్), భౌతిక(ఫిజిక్స్), రసాయన (కెమిస్ట్రీ) శాస్త్రాలు, చరిత్ర (హిస్టరీ), ఆర్థికశాస్త్రం (ఎకనామిక్స్), రాజనీతిశాస్త్రం (సివిక్స్), కామర్స్ వంటి సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్ను ఇస్తారు. గతంలో గణితంలో 150 మార్కులకు రెండు పేపర్లు ఉండేవి. ఇప్పుడు రెండు కలిపి 100 మార్కులకు ఒకే పేపర్ ఉంటుంది. భౌతిక, రసాయనశాస్త్రాల్లో 85 మార్కులకు పరీక్ష ఉంటుంది. దీంతో విద్యార్థులు ఎక్కువ సమాధానాలు రాయాల్సి వస్తోంది.. అందుకే 32 పేజీల బుక్లెట్ ఇవ్వబోతున్నారు. జీవశాస్త్రంలో మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. వృక్షశాస్త్రానికి, జంతుశాస్త్రానికి విడివిడిగా 24 పేజీల చొప్పున రెండు బుక్లెట్లను ఇస్తారు. ప్రశ్నపత్రంలో కూడా వృక్ష, జంతుశాస్త్రాలకు సంబంధించిన ప్రశ్నలు ఏ, బీ సెక్షన్లుగా వేరువేరుగా ఉంటాయి. విద్యార్థులు ఆయా సెక్షన్లకు సంబంధించిన సమాధానాలను ఆయా బుక్లెట్లలోనే రాయాలి. అయితే మిగిలిన సబ్జెక్టులకు పాత పద్ధతిలోనే 24 పేజీల బుక్లెట్ ఉంటుంది.
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను తగ్గించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ సబ్జెక్టుల్లో ఫస్టియర్లో 29.75 మార్కులకు బదులుగా 29 మార్కులు.. సెకండియర్లో 30 మార్కులు తెచ్చుకుంటే చాలు. రెండేళ్లు కలిపి కలిపి 59.5 మార్కులకు బదులుగా 59 మార్కులే ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ముఖ్యంగా, సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీలలో ఫస్టియర్లో 85 మార్కులకు జరిగే రాత పరీక్షలో ఉత్తీర్ణతకు 35% లెక్కన 29.75 మార్కులు రావాలి. అయితే దీన్ని 29 మార్కులకు తగ్గించారు. అలాగే సెకండియర్లో 85 మార్కులకు 30 మార్కులు రావాలి. రెండేళ్లు కలిపి 35% ప్రకారం 59.5 మార్కులు సాధించాల్సి ఉండగా.. ఇప్పుడు 59 మార్కులనే ఉత్తీర్ణతగా నిర్ణయించారు.
ఈ అరమార్కును సర్దుబాటు చేస్తూ.. సెకండియర్ ప్రాక్టికల్స్లో 30 మార్కులకు ఉత్తీర్ణత మార్కులను 10.5 నుంచి 11కు పెంచారు. మొదటి ఏడాదిలో కొన్ని సబ్జెక్టుల్లో 30% మార్కులు వచ్చినా.. మొత్తంగా 35% వస్తే ఉత్తీర్ణులే. ఏదైనా ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చి.. మిగతా వాటిల్లో 30% చొప్పున వచ్చినా ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. జాగ్రఫీ పరీక్షను గతంలోలాగే 75 మార్కులకు నిర్వహించి, 85 మార్కులకు లెక్కిస్తారు. ఫస్టియర్ 15, సెకండియర్ 15 కలిపి రెండో సంవత్సరంలో 30 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. అంతేకాదు ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలకు ఛాయిస్ ఉండదు. వృక్షశాస్త్రం 43, జంతుశాస్త్రం 42 మార్కులకు ఉంటాయి. ఈ మార్పులు విద్యార్థులకు పరీక్షల భారాన్ని తగ్గించి, చదువుపై మరింత దృష్టి పెట్టొచ్చంటున్నారు.