ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
మాజీ సైనికులకు తెల్ల రేషన్ కార్డు స్థానంలో ప్రత్యేకంగా వెటరన్ కార్డు ఐవ్వాలి
Updated on: 2025-09-28 14:56:00
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు ఆధ్వర్యంలో అధ్యక్షులు రేవళ్ల కిరణ్ కుమార్ పర్యవేక్షణలో బొబ్బిలి పాత కోటలో గల సంఘము కార్యాలయంలో ఆదివారం నిర్వహించబడినది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు మాజీ సైనికుల కుద్దేశించి మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాజీ సైనికుడు ఎన్ పాపారావు మాట్లాడుతూ మాజీ సైనికులకు పెన్షన్ అందుతుందనే కారణం గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు లభించడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులను ...మాజీ సైనికులను ఒకేలా చూడడం సరికాదని.. మాజీ సైనికుల కోసం ప్రత్యేక వేటరన్ కార్డును ...తెల్ల రేషన్ కార్డు స్థానంలో ఇప్పించాలని ఈ విషయముపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. దీనికి ఆయన స్పందించి, జిల్లా సైనిక అధికారీతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఏ గోవింద నాయుడు, జాయింట్ కార్యదర్శి ఎస్ ఆర్ మోహన్ రావు, కోశాధికారి వీయన్ శర్మ, తదితర సభ్యులు పాల్గొన్నారు.